Best Web Hosting Provider In India 2024


వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ
మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు చంద్రబాబు డీఎన్ఏ
వైయస్ జగన్ క్రియేటర్ అయితే చంద్రబాబు డెకరేటర్
ఎవరో చేసిన పనికి మేకప్ వేసే రకం చంద్రబాబు
నమ్మకానికి అమ్మ వంటివాడు జగన్..నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేవాడు చంద్రబాబు : కొండా రాజీవ్ గాంధీ
లోకేశ్ది పాదయాత్రా.. లేక డైటింగ్ యాత్రా?
లోకేశ్ నోరు విప్పితే బూతు…మాట్లాడితే మటాష్.
లోకేశ్…నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావ్…జాగ్రత్త..
చంద్రబాబు కొడుకు కాకపోతే నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో లోకేశ్
ఎర్ర బుక్కులో రామకోటి రాసినా పుణ్యమన్నా వస్తుంది
మరో పదేళ్లకు పవన్ ప్యాకేజీ మాట్లాడుకున్నాడు.
నువ్వు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు ట్రాన్స ఫర్ అయ్యావ్..బాబూ..?
వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొండా రాజీవ్ గాంధీ
తాడేపల్లి: నమ్మకం, పట్టుదల, కష్టం, విజయం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డీఎన్ఏ వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అభివర్ణించారు. నారా లోకేశ్ చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్ను కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను. లోకేశ్ది పాదయాత్రా.. లేక డైటింగ్ యాత్రా? లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి నోరు విప్పితే బూతు. మాట్లాడితే మటాష్. అడుగు పెడితే.. నాశనం. ఈ మూడు తప్పితే లోకేశ్ యాత్రలో ఏమైనా ఉన్నాయా? అసలు లోకేశ్ పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర ద్వారా ఏమి తెలుసుకున్నావు. నీ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏమి చెప్పదల్చుకున్నావు. చంద్రబాబు 14 ఏళ్లు పాటు సీఎంగా చేశాడు. ప్రతిసారీ చంద్రబాబు ఇస్తాం అంటాడు తప్ప ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు. ఇవాళ అమ్మ ఒడి పథకం మీద పడి ఏడుస్తున్నారు. మీ పిల్లలు, మీ నాయకుల పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి తప్ప..పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవకూడదా?.
వైయస్ జగన్ క్రియేటర్ అయితే చంద్రబాబు డెకరేటర్.
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా లోకేశ్కే గుర్తుకు రావటం లేదు. ఇక ప్రజలకు చంద్రబాబు ఎందుకు గుర్తుకు వస్తాడు. ఆసరా, పెన్షన్ పథకం తీసుకున్నా.. అవ్వాతాతలకు జగన్ గుర్తుకు వస్తారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నారని సీఎం జగన్ను ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు. చంద్రబాబును ఏమి ఉద్దరించారని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ అంటే ఉచిత విద్యుత్ గుర్తుకు వస్తుంది. ఉచిత పంటల బీమా, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, లక్షల్లో యువతకు ఉద్యాగాలు ఇచ్చారంటే సీఎం జగన్ గుర్తుకు వస్తారు. సీఎం జగన్ గారు ఏదైనా పోరాడి సాధిస్తారు. కష్టపడతారు. జగన్ గారు చరిత్ర సృష్టిస్తారు. కానీ, చంద్రబాబు అలా కాదు.. ఎవరో చేసిన పనికి మేకప్ వేసే రకం. జగన్ క్రియేటర్ అయితే చంద్రబాబు డెకరేటర్. సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే.. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం గుర్తుకు వస్తుంది. మరి, చంద్రబాబు పేరు చెబితే ఏం గుర్తుకు వస్తుంది.
లోకేశ్ నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావ్…
లోకేశ్ 3000 కి.మీ పాదయాత్రలో 30 ఏళ్ల చంద్రబాబు చేసిన అన్యాయాలు తప్ప ఒక్క అభివృద్ధీ కనపడదు. లోకేశ్ చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలకు మంచి చేసేవారు లోకేశ్ దృష్టిలో సైకోనా? పేదవర్గాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడుపేవారు సైకోనా? నరరూప రాక్షసుల కళ్లకు భగవంతుడు ఎప్పుడూ శత్రువుగానే కనపడతాడు. ప్రజలను పీక్కు తినే నారాసుర రాక్షసులకు పేద ప్రజలకు మేలు చేసే భగవంతుడు లాంటి జగన్ సైకోలానే కనపడతారు. కానీ, ప్రజలకు దేవుడిలా కనపడతాడు. పెద్దపెద్ద మాటలు మాట్లాడే.. చంద్రబాబుకు కొడుకుగా పుట్టి ఉండకపోతే.. ఎన్టీఆర్ భవన్ గేట్లు తుడవటానికి పనికి వస్తావా లోకేశ్. ఆలోచించుకో లోకేశ్. నారా లోకేశ్ నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా ఎవ్వరూ కొనరు. స్థాయిని మించిన మాటలు నీకు ఎందుకు లోకేశ్.
వైయస్ జగన్ పేదల పక్షపాతి. అందుకే ప్రజల ముంగిటకే పాలన
నమ్మకానికి అమ్మ వంటివాడు జగన్ అయితే.. నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేవాడు చంద్రబాబు*
ఫ్యామిలీ హెల్త్ డాక్టర్, పౌర సేవలు నేరుగా ఇంటి వద్దకు వస్తున్నాయి. ఏ సర్టిఫికెట్ కావాలన్నా ప్రజల వద్దకే పాలన వెళ్తోంది. ఇంటికే రేషన్, పెన్షన్ వస్తోంది. జగన్ గారి పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకు వస్తున్నాయి. చంద్రబాబు పేరు చెబితే ఏమి గుర్తుకు వస్తున్నాయి. గడిచిన 30 ఏళ్లలో చంద్రబాబు చేసినవి ఏమున్నాయి. జగన్ మోహన్ రెడ్డి నమ్మకానికి అమ్మ వంటి వాడు అయితే.. చంద్రబాబు నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేవాడు. ఇదీ జగన్ గారికి చంద్రబాబుకు తేడా.
ఎర్ర బుక్కులో రామకోటి రాసినా పుణ్యం వస్తుంది లోకేష్
రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమం ఓర్వలేక కడుపు మంటతో దిక్కుమాలిన విమర్శలు, పనికి మాలిన రాతలు రాస్తున్నారు. జగన్ లాంటి కొడుకు లేడని చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటి తండ్రి లేడని లోకేశ్ బాధపడతారు. చంద్రబాబు, లోకేశ్ కడుపుమంటతో రాష్ట్ర ప్రజలకు అందుతున్న పథకాలపై రెచ్చిపోయి తప్పుడు రాతలు రాస్తే ఎవ్వరూ చూస్తూ కూర్చోరు. చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వటానికి ప్రజలు ఎవ్వరూ సిద్ధంగా లేరు. జగన్ గారు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రజలకు గుర్తు ఉంటుంది. నమ్మకం, పట్టుదల, కష్టం, విజయం జగన్ గారి డీఎన్ఏ అయితే.. మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు చంద్రబాబు డీఎన్ఏ. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారు తప్పితే.. రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాం. బాగు చేస్తామన్న మాట ఎక్కడా లేదు. లోకేశ్ పాదయాత్ర పేరుతో ఎంత తిరిగినా ఎన్ని ఎర్రబుక్కులు రాసినా ఒరిగేది ఏమీలేదు. దానిబదులు రామకోటి రాస్తే పుణ్యమైనా వస్తుంది. బెదిరింపులు, బడాయి మాటలు ఎక్కడైనా చూపించుకో లోకేశ్ అని హితవు పలికారు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
అమరావతి అనే దాన్ని చంద్రబాబు డ్రామా కంపెనీగా మార్చారు. గత 100 ఏళ్ల చరిత్ర తీస్తే.. తెలంగాణ, రాయలసీమ కంటే వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పారు. విశాఖను రాజధానిగా చేయకుండా.. చంద్రబాబు స్వలాభం కోసం రియల్ ఎస్టేట్ రాజధానిగా తన ధనదాహం తీర్చుకోవటానికి పెట్టాడు. అమరావతికి ఏమైనా ఇబ్బంది అవుతుందని రైతుల పేరుతో డ్రామా ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తున్నారు.
* మూడు రాజధానుల కోసం నాలుగేళ్లుగా ఉద్యమంగా జరుగుతోంది కదా. దాన్ని పచ్చ మీడియా బ్యానర్ ఐటంగా ఎందుకు పెట్టరు. అమరావతి అనేది చంద్రబాబు ఆయన వర్గానికి వ్యాపార రాజధాని. ఆదాయ మార్గం తప్పితే ప్రజా రాజధాని కాదు. అలాంటి దానిపై నాలుగేళ్లు కాదు.. నలభై ఏళ్లు అయినా పెద్దగా ఉపయోగం ఎవ్వరికీ ఉండదు.
* 2024 ఎన్నికల వరకు పవన్ మాట్లాడుకున్నాడని అనుకున్నాను. కానీ, ఈ ప్యాకేజీ డీలింగ్ మరో పదేళ్లు చంద్రబాబుతో పవన్ మాట్లాడుకున్నాడు. సూట్ కేసులు అంది ఉంటాయి. మరో పదేళ్లు చంద్రబాబు కాడె మోస్తానని పవన్ అంటున్నాడు. సిగ్గు పడాల్సింది జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు.
* టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటులో తేడా వచ్చాయని వాదన వినిపిస్తోంది. పవన్ వెళ్లి నారా లోకేశ్ పక్కన నిలబడితే జనసేన కార్యకర్తలు తిట్టేలా ఉన్నారు. తెలంగాణలో డిపాజిట్ కూడా జనసేనకు రాలేదు. పవన్ చేసిన తప్పును కార్యకర్తలు, అభిమానులే ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలను, అభిమానులను అమ్ముడుపోయాడని పవన్ అంటున్నాడంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు.
* తనను ప్రశ్నిస్తున్న అభిమానులు, కార్యకర్తలే అమ్ముడు పోయారని పవన్ అంటున్నాడు. ఈ లెక్కన పవన్ చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడు పోయాడని మేం అనటంతో తప్పు లేదు.
* ఎమ్మెల్యేలు, మంత్రులు బదిలీలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అంటారు. మరి, చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడో చెప్పాలి. ఎన్టీఆర్, గంటా, వంగలపూడి అనిత, మాజీ మంత్రి జవహర్లు పలుచోట్ల బదిలీలు అయ్యారు. అవేమీ ట్రాన్స్ఫర్లు కావా? దానిపై చంద్రబాబుకు క్లారిటీ లేవా? వంగలపూడి, జవహర్లు దళితులు కారా? వైఎస్ఆర్సీపీ చేస్తే ట్రాన్స్ఫర్, చంద్రబాబు చేస్తే బంఫర్ ఆఫరా? లేక చంద్రబాబుకు మాత్రమే ప్రత్యేకమైన రాజ్యాంగాలు ఏమైనా ఉన్నాయా?
* రాజకీయ వ్యూహాల్లో భాగంగా మార్పులు, చేర్పులు, కూర్పులతో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. రాబోయే ఎన్నికల్లో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలమైన అభ్యర్థులను ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అ