Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకే శ్వేతపత్రం, ఎవరినీ కించపరిచేందుకు కాదు- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాడీవేడిగా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవని విమర్శించారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కొన్ని వాస్తవాలు కఠోరమైనవన్నారు.
ట్రెండింగ్ వార్తలు
అఖిలపక్షం సలహాలు తీసుకుంటాం
“శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి, అవమానించడానికి కాదు. మేం ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం. ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక. మీకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి నేను ఫోన్ చేశాను. స్వార్థ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మేం ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటాం”- సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కీర్తిని పెంచే దిశగా
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని పెంచే దిశగా పని చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పులు తీసుకోకుండా రాష్ట్రాన్ని ముందుగా తీసుకొస్తామని చెప్పారు. శ్వేతపత్రం విడుదల వెనక ఇతర ఉద్దేశాలు లేవన్నారు. తెలంగాణలో ఏం జరిగిందని చెప్పటం కోసం ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించామన్నారు. రాష్ట్రం దివాలా తీసిందనే చెప్పే ప్రయత్నం చేయటం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడుతామని అన్నారు. అన్నివర్గాలను పిలిచి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగ్, ఆర్బీఐ నివేదికలు ఆధారంగా శ్వేత పత్రం రూపొందించామన్నారు. శ్వేత పత్రాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు.
Best Web Hosting Provider In India 2024
Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకే శ్వేతపత్రం, ఎవరినీ కించపరిచేందుకు కాదు- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాడీవేడిగా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవని విమర్శించారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కొన్ని వాస్తవాలు కఠోరమైనవన్నారు.
ట్రెండింగ్ వార్తలు
అఖిలపక్షం సలహాలు తీసుకుంటాం
“శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి, అవమానించడానికి కాదు. మేం ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం. ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక. మీకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి నేను ఫోన్ చేశాను. స్వార్థ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మేం ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటాం”- సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కీర్తిని పెంచే దిశగా
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని పెంచే దిశగా పని చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పులు తీసుకోకుండా రాష్ట్రాన్ని ముందుగా తీసుకొస్తామని చెప్పారు. శ్వేతపత్రం విడుదల వెనక ఇతర ఉద్దేశాలు లేవన్నారు. తెలంగాణలో ఏం జరిగిందని చెప్పటం కోసం ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించామన్నారు. రాష్ట్రం దివాలా తీసిందనే చెప్పే ప్రయత్నం చేయటం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడుతామని అన్నారు. అన్నివర్గాలను పిలిచి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగ్, ఆర్బీఐ నివేదికలు ఆధారంగా శ్వేత పత్రం రూపొందించామన్నారు. శ్వేత పత్రాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు.