YSRCP Nandigama : రైతు భరోసా కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన..

 

YSRCP Nandigama :

ysrcp nandigama

nandigama mla

mla nandigama

jagan mohan rao monditoka

 

 

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.28-9-2022(బుధవారం) ..

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..

రైతు భరోసా కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

కంచికచర్ల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం ప్రారంభించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరమని , రైతులకు సాగు మెలకువలతో పాటు సలహాలు -సూచనలు అందించి నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు , నకిలీల బెడద లేకుండా ఈ కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు -పురుగుమందులు -ఎరువులు కూడా అందిస్తున్నట్లు తెలిపారు , దేశానికి పట్టేడన్నం పెట్టే ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని , ముఖ్యంగా సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతీ యేటా వ్యవసాయ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నారని గుర్తు చేశారు ,

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ ,ఎంపీపీ ,జడ్పిటిసి , మండల పార్టీ అధ్యక్షులు , పంచాయతీ సభ్యులు, వ్యవసాయ అధికారులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

YSRCP Nandigama : ఘనంగా గుర్రం జాషువా 127 వ జయంతి ..

 

Follow us : Facebook,Twitter,Instagram

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigma

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *