YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :
ది.02-10-2022(ఆదివారం) ..
వేములపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల మండలంలోని వేములపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చర్మ కళాకారులు -డప్పు కళాకారులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం పంపిణీ చేశారు .. ముందుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలు ,ప్రాంతీయ భేదాలు ,రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని , దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయాలని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు , అదేవిధంగా పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారని సొంత గ్రామంలోని కాకుండా ఆరు నెలలుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నివాసం ఉన్న ఆ ప్రాంతంలోనే పింఛను పొందేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీలు కల్పిస్తున్నారని తెలిపారు , అదేవిధంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన అనతి కాలంలోనే పింఛన్లు మంజూరయ్యాలా ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు , గతంలో ఎన్నడూ లేనివిధంగా చర్మ కళాకారులకు డప్పు కళాకారులకు పెన్షన్లు మంజూరు అవుతున్నాయన్నారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,ఎంపీటీసీ ,జడ్పిటిసి, ఎంపీపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా…
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka