YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.03-10-2022(సోమవారం) ..
సమ న్యాయమే సీఎం వై.యస్.జగన్ అభిమతం ..
పల్లగిరి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతమని , ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆయన పాలన సాగిస్తున్నారన్నారు , సీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు , మూడేళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా ప్రభుత్వం పని చేసిందని , ఆ లబ్ధిని వివరించడానికి గడపగడపకు వెళ్తున్నామని – అదేవిధంగా స్థానికంగా సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు , అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవికిరణ్ రెడ్డి , ఎంపీటీసీ వేల్పుల రాము, నాయకులు బుచ్చిరెడ్డి ,అలీషా ,తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : ఇంద్రకీలాద్రిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో..
Follow us : Facebook ,Instagram ,Twitter
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka