YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.04-10-2022(మంగళవారం) ..
సంక్షేమం -అభివృద్ధికి సమ ప్రాధాన్యం ..
పట్టణంలోని 14 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 14 వ వార్డులో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పలు సంక్షేమ పథకాలతో పాటు .. ప్రజా ప్రయోజనాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని , రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ -అందరి సంక్షేమం ,అభ్యున్నతికై వైయస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు , సచివాలయ -వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నారని చెప్పారు , ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా -లేదా ? ,ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ , ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేలా ముందుకు సాగుతున్నామన్నారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,కో ఆప్షన్ సభ్యులు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,మున్సిపల్ అధికారులు, వాలంటీర్లు ,సచివాలయం సిబ్బంది ,రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : పల్లగిరి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..
Follow us : Facebook ,Twitter ,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka