YSRCP Nandigama : రాఘవాపురం గ్రామంలో “జల జీవన్ మిషన్” ద్వారా వాటర్ లైన్ ఏర్పాటు

ysrcp nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది‌.18-10-2022(మంగళవారం) ..

జల జీవన్ తో సురక్షిత తాగునీరు ..

రాఘవాపురం గ్రామంలో “జల జీవన్ మిషన్” ద్వారా వాటర్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ మండలంలోని రాఘవాపురం గ్రామంలో రూ.30 లక్షల అంచనా విలువతో “జల జీవన మిషన్” ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శంకుస్థాపన నిర్వహించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించటమే జలజీవన్ మిషన్ లక్ష్యమని , జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కలెక్షన్లు అందిస్తామని తెలిపారు , పనులను తరితగతిన పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సూచించారు ,

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గాదెల బాబు, గ్రామ సర్పంచ్ సురేష్ , నాయకులు స్టాలిన్ ,చంద్రశేఖర్ , మండల పార్టీ కన్వీనర్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..

 

ysrcp nandigama : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన..

 

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *