Best Web Hosting Provider In India 2024

మీడియా సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూనే కదా పట్టుబడింది బాబూ..!
హవ్వ.. నవ్విపోతారన్న సిగ్గు అన్నా లేదా బాబూ..!
దొంగ ఓట్లకు ఆద్యుడు చంద్రబాబే..
చంద్రబాబు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు
గెలిచిన ప్రతిసారీ కుప్పంలో దొంగ ఓట్లతోనే బాబు గెలిచాడు.
హైదరాబాద్లో ఓటేసి ఇక్కడా ఓటేస్తామంటే కుదరదు బాబూ..!
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగితే చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం:
బాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. కుట్రలు, క్యాష్, కుతంత్రాలపైనే నమ్మకం
అలాంటి నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటానికి బుద్ధి ఉందా..?
పవన్ కల్యాణ్.. నీకెందుకు ఇక గ్లాసు గుర్తు..సైకిల్ గుర్తుపైనే పోటీ చెయ్..!
బహుశా గుర్తింపు లేని పార్టీకి అనుమతి లభించదని చంద్రబాబు చెంచాగా వెళ్లాడేమో..?
వైయస్ఆర్సీపీ 175+25 టీం రెడీ..మీరింకా సీట్ల పంపకాలే చేసుకోలేదు.
మీరు, మీ విషపుత్రికలు కక్కే విషం స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతోంది.
రాధాకృష్ణ బల్లకింద ఉన్నాడా? లేక బాత్రూమ్లో దాక్కుని విని రాస్తున్నాడా?
చంద్రబాబు పని అయిపోయింది..ఈ ఎన్నిక తర్వాత చాప సర్ధుకుని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లడమే
మంత్రి అంబటి రాంబాబు.
పల్నాడు: పార్టీ ఫిరాయింపు దొంగతో కలసి వెళ్ళి దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.చంద్రబాబు పని అయిపోయింది..ఈ ఎన్నిక తర్వాత చాప సర్ధుకుని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లడమే అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే..
ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబే:
– కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు మన అంధ్రప్రదేశ్ కు వచ్చారు. రాజకీయ పార్టీలను కలిసి వారి ఫిర్యాదులను విని ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పక్షాలతో సమావేశం అయ్యారు.
– దీనిలో చిత్రంగా శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి కొన్ని అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు.
– మేము అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రొత్సహిస్తున్నామని మాట్లాడారు.
– విచిత్రంగా ఆయనతో పాటు వైయస్ఆర్సీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటు వేసిన తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని తీసుకెళ్లారు.
– దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి మరో దొంగ ఓటరును వెంటబెట్టుకుని వెళ్లడం విడ్డూరం.
– వైయస్ఆర్సీపీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచి..మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అమ్ముడుపోయి..చంద్రబాబు చెప్పినట్లుగా ఓటు వేసిన శ్రీదేవి గారిని వెంటబెట్టుకుని వెళ్లి మాపై ఫిర్యాదు చేస్తున్నాడు.
– ఈయన ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్లు నటిస్తున్నాడు…ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి,మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా వెంటబెట్టుకుని వెళితే ఆయన బండారం ఇంకా బయటపడేది.
– ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన చంద్రబాబే.
– ఆయనకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదు. ఆయనకు క్యాష్, కుట్రలు, కుత్రంత్రాలపై మాత్రమే ఆయనకు నమ్మకం.
– ఇలాంటివి చేసే ఆయన ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదు.
– వెనక్కు వెళ్లి చూస్తే..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. మనవద్ద జరిగేలా కాస్ట్లీ ఎన్నికలు ఎక్కడా ఉండవు.
– దీనికి కారణం చంద్రబాబే. ఎన్టీఆర్ను దించిన తర్వాత తాను గెలవడం కోసం ఓటర్లను కొనేందుకు విపరీతంగా ఖర్చు పెట్టింది చంద్రబాబే.
– ఇలాంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు.
– అసలు ప్రజాస్వామ్యంపై మాట్లాడటానికి చంద్రబాబుకి బుద్దుందా?
– తెలంగాణ నుంచి నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావో మర్చిపోయావా బాబూ..?
– ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్గా పట్టుబడటం వల్లే కదా నువ్వు ఏపీ పారిపోయి వచ్చావ్..?
దొంగ ఓట్లపై గెలుస్తున్న దొంగ చంద్రబాబు:
– గెలిచిన ప్రతిసారీ కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే బాబు గెలిచాడు.
– నేడు ఆ దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగితే చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం.
– దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబునాయుడు ఓడిపోవడం గ్యారెంటీ.
– దొంగ ఓట్లతోనే రాజకీయం చేసిన దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు.
– మాకెందుకు దొంగ ఓట్లు..? ఐదేళ్లు చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన ప్రభుత్వం మాది.
– ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్ గారిని అన్ని వర్గాల వారు గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే పరిస్థితి ఉంది.
– మాకు అసలు దొంగ ఓట్లతో పనేంటి? 175కి 175 స్థానాలూ గెలిచే పరిస్థితి మాకుంది.
– మేం మానిప్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు..ఆ లక్షణమే మాకు లేదు.
– గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు చాలా ప్రమాదకరం అన్నాడు. వాటివల్లే మేం ఓడిపోయాం అన్నాడు.
– 2019 ఎన్నికలప్పుడు ఈవీఎంలలో సైకిల్కు ఓటు వేస్తే ఫ్యాన్కి పడింది అని చెప్పాడు.
– ఇవాళ ఆ మాటలు ఏమయ్యాయి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయలేదేం?
– గత ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి సీఈవోగా ఉన్న దివ్యేది గారిని ముఖ్యమంత్రిగా ఉండి బెదిరించే కార్యక్రమం చేశాడు.
– ఓటమి భయంతో ఓడిపోతానని తెలిసినప్పుడు చంద్రబాబు ఇలాంటి వేషాలు వేయడం కొత్తేమీ కాదు.
పవన్ కల్యాణ్ నీకెందుకు గ్లాసు గుర్తు..సైకిల్ గుర్తుపైనే పోటీ చెయ్..!:
– శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్తే వెళ్లాడు..పవన్కల్యాణ్ను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు.
– బహుశా గుర్తింపు లేని పార్టీకి అనుమతి లభించదని, చంద్రబాబు చెంచాగా వెళ్లాడేమో..?
– ఎందుకయ్యా..పవన్ కల్యాణ్ నీకు గ్లాసు గుర్తు..? సైకిల్ గుర్తుపైనే పోటీ చేయవచ్చు కదా?
– నీ పార్టీని విలీనం చేసేయ్…కావాలంటే కొంచెం ప్యాకేజీ పెంచండి అని అడిగితే బాగుండేది.
– దుర్మార్గపు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడు. చెప్పిన మాట చెప్పకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
– ఆయనకు తానా తందానా అనే పత్రికలు ఉన్నాయి..వారి రాతలు చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చి కూర్చున్నట్లే ఉంటుంది.
– వైయస్ఆర్సీపీ పని అయిపోయింది…తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూర్చుంది అన్నట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తూనే ఉంటాయి.
– జగన్ గారు జైలుకు వెళ్లిపోతాడట..వాయిదాలకు వెళ్లడం లేదంటూ లెక్కలేశారు.
– షర్మిల గారు వస్తే జగన్ గారు ఏదో అన్నాడని రాధాకృష్ణ రాతలు రాశాడు. రాధాకృష్ణ బల్లకింద ఉన్నాడా? బాత్రూమ్లో ఉన్నాడా?
– మీరు ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినా తిరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే ముఖ్యమంత్రి.
– ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకుని ప్రజల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకునే క్రమంలో జగన్ గారు పరిపాలన చేశారు.
వైయస్ఆర్సీపీ 175+25 టీం రెడీ..మీరింకా సీట్ల పంపకాలే జరగలేదు:
– ఎన్నికల కమిషన్ వచ్చింది కదా అని దత్తపుత్రుడు, దత్తతండ్రి ఇద్దరూ వెళ్లి వినతులిస్తే సరిపోదు.
– అసలు విషయం వదిలేసి కొసరు విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
– పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు..కలిసి తిరిగితే తిరిగారు..మాకు అభ్యంతరం లేదు. ఇంకా మీరు సీట్లు పంచుకునే కార్యక్రమమే ప్రారంభం కాలేదు.
– జగన్మోహన్రెడ్డి గారు టీం 175+25 టీం రెడీగా ఉంది.
– త్వరలో టీంను ప్రకటించబోతున్నారు.
– మేం ఎవర్ని మారిస్తే మీకేంటి బాధ..? సమయాన్ని బట్టి మార్చుకుంటాం..వారితో సర్ధుకుంటాం.
– ఆయన్ను మార్చారు..ఈయన్ని మార్చలేదు అంటాడు…నువ్వు చెప్పినట్లు మార్చాలా?
– నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. మొసలి కన్నీరు ఎందుకు.?
– అంబటి రాయుడు టీ20కి దుబాయ్లో ఆడటానికి వెళ్లాడు..రాజకీయాల్లో ఉండకూడదు కాబట్టి పార్టీకి రాజీనామా చేశాడు.
– దాన్ని ఈనాడు మొదటి పేజీ వార్త రాసింది. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కేశినేని నాని, ఆయన కుమార్తె, కార్పొరేటర్ శ్వేత రాజీనామా చేస్తే ఈనాడులో ఆఖరు పేజీ వార్త.
– ఇలా ఏదో ఒక విధంగా మానిప్యులేట్ చేసి చంద్రబాబును గొప్పగా చూపాలని, జగన్ గారిని చిన్నగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్ధం అయ్యాయి.
– మీరు కక్కే విషం స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతోంది. రాష్ట్ర ప్రజలు మీ తీరును పూర్తిగా అర్ధం చేసుకున్నారు.
– మీ పత్రిక..మీ ఇష్టం..మీరు రాసుకోండి..మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.
– ఎన్నికలకు వెళ్లబోతున్నాం..అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళుతున్నాం.
– ఎవరినీ కలుపుకునేది లేదు..సింగిల్గానే వెళ్తున్నాం..175+25 మొత్తం కొట్టుకుని తిరిగివస్తాం. మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం.
– మీరెంత మంది కలిసి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు.
– ఇక చంద్రబాబు పని అయిపోయింది..ఈ ఎన్నిక తర్వాత చాప సర్ధుకుని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేయకూడదు బాబూ..!:
– హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా? అంటున్నాడు.
– ఎక్కడున్నా ఇక్కడ ఓటు ఉండొచ్చు..సందేహం లేదు. అయితే అక్కడ ఒక ఓటు..ఇక్కడో ఓటు ఉండకూడదు బాబూ..
– అయితే హైదరాబాద్లో మొన్న ఓటు వేసి మళ్లీ ఇక్కడకు వచ్చి ఓటు వేస్తామంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది..?
– చంద్రబాబుకు అక్కడా..ఇక్కడా ఓటు కావాలట..అది అప్రజాస్వామికం బాబూ..!
– ప్రతి ఓటరుకు ఒక ఓటే ఉండాలి..రెండు చోట్ల నమోదు కావాలి.
– టీడీపీ వాళ్లకు కాస్త పిచ్చెక్కువ..అందుకే నా మీద విమర్శలు చేస్తుంటారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
– కన్నా లక్ష్మీనారాయణ నా మీద చాలా మాట్లాడుతుంటాడు. ఆయన ఒక పార్టీకి కన్నం వేయడం వేరే పార్టీలో చేరడం అలవాటు.
– ప్లీడర్లు వాదించినట్లే కన్నా కూడా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తరఫున కూడా వాదిస్తాడు.