Best Web Hosting Provider In India 2024
19 Jan 2024 3:07 PM

వైయస్ఆర్సీపీ శ్రేణుల ఆగ్రహం
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై ఈనాడులో రాసిన చెత్త రాతలపై వైయస్ఆర్సీపీ శ్రేణులు, మంత్రులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. కేవలం చంద్రబాబు కోసమే ఇలాంటి వార్తలు రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల ఈనాడు పేపర్ను చించివేసి, మంటల్లో వేసి దగ్ధం చేస్తున్నారు.
పచ్చ మీడియా ఏడుపే.. ఏడుపు..
- పచ్చ బ్యాచ్కు ఏదీ చాతకాదు.. ఇంకొకరు చేస్తే చూడలేరు.
- ఇదీ చంద్రబాబుకు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా!.
- సీఎం వైయస్ జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు.
- అంబేద్కర్ విగ్రహావిష్కరణ లక్షలాది పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాల ఇంటి పండుగ.
- పచ్చ బ్యాచ్ మీరు ఏడుస్తూనే ఉండండి.
- మేము ఆ వర్గాలను ప్రగతిపథం వైపు నడిపిస్తూ ముందుకు సాగుతాం: వైయస్ఆర్సీపీ