YSRCP Nandigama : పట్టణంలోని 7 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” …

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.22-11-2022(మంగళవారం) ..

పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ పరిపాలన ..

పట్టణంలోని 7 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 7 వ వార్డులో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పలు సంక్షేమ పథకాలతో పాటు .. ప్రజా ప్రయోజనాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా పాలన సాగిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు ,రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ -అందరి సంక్షేమం ,అభ్యున్నతికై వైయస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు , సచివాలయ -వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నారని చెప్పారు , ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా -లేదా ? ,ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ , ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేలా ముందుకు సాగుతున్నామన్నారు ,

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ ,కౌన్సిల్ సభ్యులు ,కో ఆప్షన్ సభ్యులు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,మున్సిపల్ అధికారులు, వాలంటీర్లు ,సచివాలయం సిబ్బంది ,రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *