Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2,146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2,025 మంది వైద్య సిబ్బంది, డీఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్కు కాంట్రాక్ట్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.