Mudragada Join YSRCP : ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను – పోటీపై ‘ముద్రగడ’ కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024

Mudragada Padmanabham News : వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి(YS Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు. ఏలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు.  వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు

“సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలో చేరుతాను. మార్చి 14వ తేదీన సాయంత్రం చేరుతాను. వైసీపీ నేతలు పార్టీలోకి రావాలని చర్చలు జరిపారు. మరిన్ని సంక్షేమ పథకాలు రావాలనే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. పోటీపై ఎలాంటి కండిషన్ లేకుండానే చేరుతున్నాను. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఇస్తే తీసుకోవటానికి సముఖంగా ఉన్నాను. ప్రస్తుతానికి అయితే పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడు కూడా చేయడు. జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను అని జగన్ కు చెప్పాను” అని ముద్రగడ వెల్లడించారు.

WhatsApp channel
 

టాపిక్

 
Ysrcp ManifestoYsrcpYsrcp CandidatesAndhra Pradesh Assembly Elections 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024