Best Web Hosting Provider In India 2024
04 Apr 2024 3:21 PM

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి
నెల్లూరు జిల్లా: టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులును చట్టసభలో కూర్చోబెట్టేందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల అసెంబ్లీ టికెట్ ఇచ్చానని పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
- టిప్పర్ డ్రైవర్కు చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చా
- వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివాడు
- చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా బాధపడలేదు
- ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు
- వైయస్ జగన్ టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు
- టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటి బాబు?
- కోట్ల రూపాయాలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు
- వైయస్ జగన్ ఏం తప్పు చేశాడని టీడీపీ అవహేళన చేస్తోంది.
- ఆటో, ట్యాక్సి, టిప్పర్ డ్రైవర్లకు తోడుగా ఉంటున్నాం
- ఏడాది రూ.10వేల చొప్పున, ఐదేళ్లలో రూ.50 వేలు ఇచ్చాం
- వాహనమిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చాం