Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్
అది చూసి పెత్తందారుల ప్రతినిధులైన చంద్రబాబు అండ్ కో.. తట్టుకోలేకపోతున్నారు.
అధికారంలోకి వస్తే ఇంగ్లీషు మీడియం రద్దు, కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తామని నిస్సిగ్గుగా చెప్తున్నారు.
పేదల ఆత్మగౌరవాన్ని ఐక్యరాజ్యసమితిలో ఎగరేస్తే.. మీకెందుకు అంత కడుపుమంట?: యనమల నాగార్జున యాదవ్
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో ప్రపంచ స్థాయి విప్లవాన్ని తెచ్చారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. అది చూసి పెత్తందారుల ప్రతినిధులైన చంద్రబాబు అండ్ కో.. తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు.
నాగార్జున యాదవ్ ఏమన్నారంటే..
విద్యారంగంలో మార్పులు చూసి పెత్తందార్లు, వారి పాలేర్ల కడుపుమండుతోంది:
- – పేద విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలని, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు గ్లోబల్ స్టేజ్కి ఎదగాలని ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
- – అమ్మ ఒడితో ఆర్థిక సాయం అందించినా, నాడు–నేడుతో స్కూల్స్ భవనాలు బాగుచేసినా గోరుముద్దతో ఆకలి తీర్చినా అది జగనన్నకే సాధ్యమైంది.
- – ఐఎఫ్పీ ప్యానళ్లు ఇచ్చినా, స్మార్ట్ టీవీలిచ్చినా, 8వ తరగతి నుంచి ట్యాబ్లు ఇచ్చినా మనసున్న జగనన్నకే చెల్లింది.
- – ప్రపంచ ప్రమాణాలతో మన రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల విద్యార్థులు చదువుకుంటున్న తీరు కళ్లముందే కనిపిస్తోంది.
- – భారత దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్మోహన్రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.
- – జగన్ గారు రూ.73వేల కోట్లు వెచ్చించి విద్యారంగంలో ప్రపంచస్థాయి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
- – దీంతో, పెత్తందారుల ప్రతినిధి చంద్రబాబు, వారి వద్ద పాలేరుగా పనిచేస్తున్న పవన్ కల్యాణ్లకు కడుపు మండిపోయింది.
- – మేం అధికారంలోకి వస్తే ఇంగ్లీషు మీడియం రద్దు చేస్తాం..కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తామని చంద్రబాబు కూటమి బాహాటంగానే చెప్తుంది.
- – నాడు–నేడు, విద్యాదీవెన, వసతి దీవెన వంటివన్నీ రద్దు చేస్తామని నిస్సిగ్గుగా చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయి.
- – మొన్నటికి మొన్న అమిత్షా ధర్మవరం సభలో మాట్లాడుతూ, చంద్రబాబు- పవన్ కల్యాణ్ లను పక్కనపెట్టుకుని ఇంగ్లీషు మీడియంపై తన అక్కసు వెళ్ళగక్కారు. దీనినిబట్టి, వీరంతా, పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువులకు వ్యతిరేకం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి.
మీ బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్లు ఏ మీడియంలో చదివారు?:
- – చంద్రబాబూ.. నువ్వు నారా లోకేశ్ను ఇంగ్లీషు మీడియంలో చదివించలేదా?
- – పవన్ కల్యాణ్..1984లో నువ్వు నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూళ్లో చదువుకోలేదా?
- – 40 ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్ని ఆయన తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో చదివించారు.
- – సరే ఆయనకు చదువు అబ్బలేదు..గాలికి తిరిగాడు..అది ఆయన వ్యక్తిగతం.
- – 2024లో బడుగు బహీనవర్గాలు, దళితులు, బీసీలు, మైనార్టీలు వాళ్ల బిడ్డల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించుకోవాలని కోరుకోవడంలో తప్పేంటి?
- – ఈనాడు రామోజీరావు కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా..!
- – ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.., నీ కుమారుడు, కుమార్తె ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా.
- – ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని సదుపాయాలు మీ బిడ్డలకు, మనవళ్లకు, మనవరాళ్లకు అందించారే..పేద ప్రజలకు అందితే ఎందుకంత కంటగింపు?
- – జగన్ గారు నాడు-నేడు ద్వారా గవర్నమెంటు బడుల రూపురేఖలు పూర్తిగా మార్చారు. 3వ తరగతి నుంచి టోఫల్, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ తో ప్రపంచస్థాయి మేటి విద్యను ఆంధ్రప్రదేశ్ లో పేద పిల్లలకు అందిస్తున్నారు.
- – ఏపీలోని బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని ఐక్యరాజ్యసమితిలో ఎగరేస్తే..మీకెందుకు అంత కడుపుమంట?
ఇంటికో ఉద్యోగం అని, తన ఇంట్లో లోకేశ్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడు:
- – చంద్రబాబు తన మేనిఫెస్టోలో 20లక్షల ఉద్యోగాలిస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.
- – 2014లోనూ చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి అన్నాడు.
- – ఆయన అధికారంలోకి రాగానే, తన ఇంట్లో ఉన్న దద్దమ్మ లోకేశ్కు మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నాడు. ఇంకెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.
- – చంద్రబాబు 2014–19 కాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశాడు.
- – జగన్ గారు సీఎం అయ్యేటప్పటికీ ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.97లక్షలు.
- – జగన్ గారి ఐదేళ్ల పరిపాలన పూర్తైన తర్వాత శాశ్వత ప్రాతిపదికన 2.31లక్షల ఉద్యోగాలిచ్చారు.
- – కాంట్రాక్టులో 43,923 మందికి, ఔట్ సోర్సింగ్లో 3.73లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
- – మొత్తం కలిపితే 6.38లక్షల మందికి కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చారు.
- – చంద్రబాబునాయుడు నేను ఉద్యోగాల సృష్టి చేస్తాను అంటున్నాడు.
- – తన హయాంలో చంద్రబాబు ప్రైవేటు రంగంలో కల్పించిన ఉద్యోగాలు కేవలం 38వేలు మాత్రమే. ఇది కేంద్ర వాణిజ్య శాఖ వద్ద ఉన్న సమాచారం.
- – జగన్ గారు ప్రైవేటు రంగంలో ఈ ఐదేళ్లలో 6.07లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
- – చంద్రబాబు కియా కారు తీసుకొచ్చాడు.. జాకీ డ్రాయర్ తీసుకొచ్చాడు అని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.
- – జగన్ గారు తన ఐదేళ్ల తర్వాత ఏపీలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, దాని ద్వారా 3.47 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.
- – ఇక జగన్ గారి తెచ్చిన కంపెనీలు చూస్తే ఇన్ఫోసిస్, విప్రో, డైకిన్, అమేజాన్, బ్లూస్టార్, టీసీఎల్ వంటివి అనేకం ఉన్నాయి.
- – విశాఖ, దావోస్ ఒప్పందాలన్నీ కలుపుకుంటే రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
- – వాటిలో ఐదారు లక్షల కోట్ల వరకూ పెట్టబడులు కార్యరూపం దాల్చాయి. వీటివల్ల సుమారు 6లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.
- – వీటన్నిటినీ రాష్ట్రంలో ఉన్న యువత, అభివృద్ధి కోరుకునే వారు గమనించాలని కోరుకుంటున్నా.
- – 2019లో బడిలో ఓటు వేసి ఉంటారు. ఇప్పుడు అదే బడికి ఓటు వేయడం కోసం వెళ్తున్నారు.
- – ఇప్పుడు ఆ ప్రభుత్వ బడి రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడండి. జగన్ గారి నాయకత్వంలో ప్రభుత్వ బడి- ఒక గుడి గా మారింది. జగన్ గారు పేద, బడుగు, పిల్లలు చదువుకునే బడిని సరస్వతీ నిలయమైన గుడిలా మార్చారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జగన్ గారు చేసిన సంక్షేమాన్ని – అభివృద్ధిని గుర్తు చేసుకుని విజ్ఞతతో ఓటు వేయండి.