Best Web Hosting Provider In India 2024
21 May 2024 8:00 PM

ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
సచివాలయం: డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధమని, కాబట్టి అతనిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు వైయస్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ నారాయణ మూర్తి ఈసీకి ఆధారాలను అందచేశారు