
Best Web Hosting Provider In India 2024

Chandrababu On Attacks : ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత పలుచోట్ల దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇదే విషయంపై వైసీపీ గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య అప్పుడే డైలాగ్ వార్ మొదలైంది. అంతేకాకుండా ట్విట్టర్ లో నూ ఇరు పార్టీలు కౌంటర్లు ఇచ్చుకుంటున్నాయి.
ఏపీలో జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండాలన్నారు. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టాపిక్