Best Web Hosting Provider In India 2024

Teachers Transfers in Telangana: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం, మళ్లీ లోక్ సభ ఎన్నికలు రావటంతో ఈ ప్రక్రియ ముందుగా సాగలేదు. ఇటీవలే ఈ ప్రక్రియపై దృష్టిపెట్టిన విద్యాశాఖ… తాజాగా షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. పదవీ విరమణకి మూడేళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. శనివారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించింది.
మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇక మల్టీ జోన్ 2లో అయితే జూన్ 8వ తేదీ నుంచి జూన్ 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
గతేడాదిలోనే ప్రారంభం….
గతేడాదిలోనే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను చేపట్టారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు కసరత్తు చేశారు. అయితే ప్రమోషన్లకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరని హైకోర్టు తీర్పునివ్వటంతో…. ప్రక్రియకు బ్రేకులు పడినట్లు అయింది. చాలా మంది టీచర్లకు టెట్ లేకపోవటంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 317తో ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావటంతో తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. వీటికితోడు పలు అంశాలపై గందరగోళం నెలకొనటంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీనికితోడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పాటు ఎన్నికల కోడ్ రావటంతో…. ముందుకు కదల్లేదు.
జూన్ 6వ తేదీతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేశారు. దీంతో ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది.
12 నుంచి బడులు – అకడమిక్ క్యాలెండర్ ఇదే….
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ను విడుదల చేసింది. జూన్ 12, 2024 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.
- అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు కాగా, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
- వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
- తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతుల వరకు అకడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూల్స్ పనిచేయనున్నాయి.
- జూన్ 12, 2024న ప్రారంభమై ఏప్రిల్ 23, 2025తో ముగుస్తాయి. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి.
- అక్టోబర్ 13 నుంచి 25 వరకు మొత్తం 13 రోజుల దసరా సెలవులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో పాటు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండాయని ప్రకటించింది.
టాపిక్