Paarijatha Parvam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ క్రైమ్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024


Paarijatha Parvam OTT Release Date: చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ మూవీ పారిజాత పర్వం ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ సంపాదించిన ఈ మూవీని సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం (జూన్ 7) ఆహా ఓటీటీలో వెల్లడించింది.

పారిజాత పర్వం ఓటీటీ రిలీజ్ డేట్

పారిజాత పర్వం ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను జూన్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. “కామెడీ థ్రిల్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఆహా ఈ విషయాన్ని తెలిపింది. ఈ కామెడీ మూవీని థియేటర్లలో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.

చైతన్య రావు నటించిన ఈ సినిమాను కంభంపాటి సంతోష్ డైరెక్ట్ చేశాడు. సునీల్, హర్ష కామెడీ కాస్త ఆకట్టుకునేలా ఉందని మూవీ చూసిన తర్వాత కొందరు ప్రేక్షకులు తెలిపారు. క్రైమ్ కామెడీ జానర్ కావడంతో ఓటీటీలో అయినా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ ఆశతో ఉన్నారు.

పారిజాత పర్వం కథేంటి?

ఓ కిడ్నాప్ చుట్టూ తిరిగే కథే ఈ పారిజాత పర్వం. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రల చుట్టూ నడిపిన కిడ్నాప్ సీక్వెన్స్‌లు హైలెట్‌గా ఉంటూ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి. కిడ్నాప్ చేయడం ఓ కళ అనే ట్యాగ్‌లైన్ తో వచ్చింది. మూవీ ట్రైలర్ తో బాగా ఆసక్తి పెంచినా.. సినిమా మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ సినిమాలో సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్‌తోపాటు వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ఆహా ఓటీటీ లేటెస్ట్ రిలీజెస్

ఆహా ఓటీటీలోకి ఈ మధ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. అందులో చైతన్య రావు నటించిన షరతులు వర్తిస్తాయి మూవీ కూడా ఒకటి. ఇదే కాకుండా ప్రసన్న వదనం, 105 మినిట్స్, మిరల్, శ్రీరంగనీతులు, సిద్ధార్థ్ రాయ్, కాజల్ కార్తీక, అసురగురు లాంటి ఎన్నో సినిమాలు ఈ మధ్యే ఆహాలోకి వచ్చాయి. తాజాగా శుక్రవారం (జూన్ 7) నుంచి హన్సిక నటించిన 105 మినిట్స్.. భరత్, వాణీ భోజన్ నటించిన మిరల్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇక వచ్చే బుధవారం (జూన్ 12) నుంచి ఈ క్రైమ్ కామెడీ మూవీ పారిజాత పర్వం కూడా రాబోతోంది. ఆహా ఓటీటీ ప్లాన్స్ మూడు నెలలకు కనీసం రూ.99 నుంచి ప్రారంభమవుతున్నాయి. అత్యధికంగా ఏడాదికి రూ.899తో ఆహా గోల్డ్ ప్లాన్ తీసుకుంటే యాడ్స్ ఫ్రీగా మూవీస్, షోలు చూడటంతోపాటు కొన్ని మూవీస్ కి 24 గంటలు ముందుగానే యాక్సెస్ కూడా లభిస్తుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024