Best Web Hosting Provider In India 2024
Ramoji Rao Funerals : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం 9 తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమసంస్కారాలు జరిగాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతి వనంలో ఈ కార్యక్రమం జరిగింది. రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
రామోజీరావు అంతిమయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేశ్ హాజరయ్యారు. స్వయంగా చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రామోజీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్
HyderabadCrime News