బీచ్‌ శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలను ఎలా నిరోధిస్తారు?

Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్‌ శాండ్‌ మైనింగ్‌లో ప్రైవేట్‌ సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్న వేశారు. దీనికి పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జవాబిచ్చారు. వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి లేవనెత్తిన ప్రశ్న సరైనదేనన్నారు. గడచిన ఏడెనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి మెరుగుదల కనిపిస్తోందో స్పష్టమవుతుందని అన్నారు. గ్రానైట్‌ తవ్వకాల కోసం లైసెన్స్‌లు పొందిన ప్రైవేట్‌ సంస్థలు అణు రియాక్టర్లలో వినియోగించే థోరియం తయారీకి అవసరమైన మొనజైట్‌ వంటి నిక్షేపాలను భారీగా స్మగ్లింగ్‌ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదైన ఖనిజాలు, మూలకాల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర‌మంత్రి చెప్పారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *