Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం వైయస్ జగన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ హెచ్చరించారు. మేం కూడా ఆ స్థాయికి దిగి చంద్రబాబును దుర్భాషలాడగమని చెప్పారు. లోకేష్ పాదయాత్ర కామెడీ సినిమాను తలపిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి గొప్ప కమెడియన్ దొరికాడు. కమెడియన్ పాత్రకు లోకేష్ పూర్తి న్యాయం చేస్తారని తెలిపారు. మాయాబజారు సినిమాలో రేలంగి పాత్ర ఎలాంటిదో రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ పాత్ర అలాంటిదన్నారు. లోకేష్ యాత్ర అంతా బూతులే అన్నారు. లోకేష్ ఏ స్థాయిలో మాట్లాడితే అలానే మేం మాట్లాడతామని హెచ్చరించారు. లోకేష్ది యువ గందరగోళం యాత్ర అని అభివర్ణించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నాగార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు.