Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో సీఎం వైయస్ జగన మోహన్ రెడ్డి చేసి చూపిస్తారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులనూ సీఎం వైయస్ జగన్ పూర్తి చేశారని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజధానిపై టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.