Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై .. మేము ఇస్తున్న గణాంకాలు, ఆధారాలు కొత్తవి కావు. ఇప్పటికే ఎన్నోసార్లు వివరణలు ఇచ్చాం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్ర అప్పులు, ద్రవ్యలోటు విషయంలో స్పష్టంగా అసెంబ్లీలో వివరణ ఇచ్చినా, టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మంగళవారం మీడియా సమావేశంలో వాస్తవాలను వివరించారు.