Best Web Hosting Provider In India 2024

జమ్ములమడుగు: ఎప్పటి నుంచో కలలు కన్న స్వప్నం స్టీల్ప్లాంట్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. చుట్టు పక్క అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చదువుకున్న మన పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందన్నారు. 30 నెలల్లోపు స్టీల్ ప్లాంట్ తొలి దశ పూర్తవుతుందన్నారు. రూ.8,800 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. వైయస్ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి బుధవారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. జిందాల్ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.