Best Web Hosting Provider In India 2024

గుంటూరు: ‘‘175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా..?’’ అని తెనాలి బహిరంగ సభ నుంచి చంద్రబాబుకు, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వానికి, పెత్తందార్ల పార్టీకి మధ్య యుద్ధం జరుగుతుందని, ప్రజలంతా ఆలోచన చేయాలని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మీ బిడ్డ వైయస్ జగన్ పరిపాలనలో మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ కోరారు. గర్వంగా చెప్పగలుగుతున్నా.. ఇచ్చిన మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చి.. మీ బిడ్డ మిమ్మల్ని ఓటు అడగటానికి ముందుకొస్తున్నాడన్నారు. తెనాలి బహిరంగ సభ వేదిక నుంచి ప్రతిపక్షాలకు సీఎం వైయస్ జగన్ సవాళ్లు విసిరారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాల 8 నెలల పాలనలో చేసిన మంచితో పోల్చుతూ ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.