Best Web Hosting Provider In India 2024

శ్రీకాకుళం: పట్టభద్రులంతా వైయస్ఆర్సీపీ వైపే ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అంతా ఏకతాటిపై నిలవాలని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరిగే శాసన మండలి ఎన్నికలలో విజయ భేరీ మోగించాలని, అధికార పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అనూహ్య మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు కన్వెన్షన్ హాల్ లో వైయస్ఆర్ సీపీ జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ సమావేశాన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకోపన్యాసం చేశారు.