Best Web Hosting Provider In India 2024

మేడ్చల్ జిల్లా పరిధిలోని దుండిగల్ సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతివేగంతో స్కోడా కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వీఎన్ఆర్ కాలేజీకి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన వారిని నారాయణ మల్లారెడ్డి హస్పిటల్ కు తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాపిక్
Road AccidentTelangana NewsCrime NewsMedchal Malkajgiri
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.