CM Revanth Reddy : వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయండి – పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024

సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలు, కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేకేతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఈ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

WhatsApp channel
 

టాపిక్

 
Ts Local Body ElectionsTelangana NewsCm Revanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024