
Best Web Hosting Provider In India 2024

Rice Dal Rates Decreased : బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరోసారి తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.160 నుంచి రూ.150కి, బియ్యం కిలో రూ.48 నుంచి రూ.47కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయించనున్నామన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు.
సంబంధిత కథనం
టాపిక్