Best Web Hosting Provider In India 2024

AP Anna Canteens : ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది. పేదలకు అతి తక్కువ ధరకు టిఫిన్, భోజనం అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తు్న్నట్లు ఇటీవల మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా అన్న క్యాంటీన్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. తొలి విడతలో భాగంగా 100 చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో 82, మూడో విడతలో 20 క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లకు హారేకృష్ణ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుంది. అన్న క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ తో పాటు భోజనం అందించనున్నారు.
203 అన్న క్యాంటీన్లు
రాష్ట్రంలోని 203 అన్న క్యాంటీన్ లను వంద రోజుల్లోగా తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇటీవల మంత్రి నారాయణ తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. గతంలో నిర్మాణం పూర్తయి చిన్నచిన్న రిపేర్లు ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అలాగే నిర్మాణాలు పూర్తి కావాల్సిన మరో 20 అన్న క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలన్నారు.
సెప్టెంబర్ 21 నాటికి
ఆగస్టు 10వ తేదీ లోపు క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్ వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అగస్టు 15 నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి, తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలని వంద రోజుల ప్రణాళికలో నిర్దేశించారు. సెప్టెంబరు 21 నాటికి పురపాలక, నగరపాలక సంస్థల్లో మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్