Best Web Hosting Provider In India 2024

నెల్లూరు జిల్లా: రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు సీఎం చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములను 22– ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.