Best Web Hosting Provider In India 2024

నందిగామ: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైయస్ఆర్ సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, క్రరలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైయస్ఆర్ సీపీ సానుభూతిపరులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ పరామర్శించారు.