ప్రతి కుటుంబానికీ మేలుచేసేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

Best Web Hosting Provider In India 2024

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని, అందుకే తోడేళ్ల మందలా ఏకమై ప్రజాప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై దాడిచేయాలని చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన కొనసాగుతోందని, మేనిఫెస్టోలోని 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడే రాజకీయాన్ని రానివ్వకూడదని కుట్రపూరితంగా, దుర్మార్గంగా ప్రభుత్వంపై తోడేళ్ల మంద దాడి మొదలుపెట్టిందని మండిపడ్డారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *