Best Web Hosting Provider In India 2024

అమరావతి: వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం ముఖ్యమంత్రి వైయస్ జగన్ వల్లే పెరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం తర్వాత వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం వైయస్ జగన్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదన్నారన్నారు. స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికైన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్ములన కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తుచేశారు. సీఎం వైయస్ జగన్ ఓట్ల కోసం కాదు మార్పు కోసం పనిచేస్తున్నారన్నారు. పరిపాలనలో అవినీతిని నిర్మూలించిన ఘనత సీఎం వైయస్ జగన్కే దక్కిందన్నారు. విద్య, వైద్యంలో మార్పులు గొప్ప విప్లవం అన్నారు. సీఎం బటన్ నొక్కుతున్నారని కొందరు హాస్యంగా మాట్లాడుతున్నారని, కానీ ఆ బటన్ వల్లనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమసాయం అందుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తుచేశారు.