Best Web Hosting Provider In India 2024

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండకు చేరుకున్నారు. మరికాసేపట్లో వరుసగా ఐదో ఏడాది తొలి విడత వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. పత్తికొండకు చేరుకున్న సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సభా ప్రాంగణం వద్ద రైతులతో సీఎం వైయస్ జగన్ ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. మరికాసేపట్లో 2023–24 సీజన్కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.