Coal India recruitment 2024 : గేట్​ స్కోర్​తో కోల్​ ఇండియాలో రిక్రూట్​మెంట్​- నేటి నుంచి రిజిస్ట్రేషన్లు..

Best Web Hosting Provider In India 2024


కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్సైట్ (coalindia.in) ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్​ మంగళవారం మొదలుకానుంది.

రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 640 పోస్టులను భర్తీ చేయనున్నారు.

గేట్ 2024 స్కోర్ ద్వారా మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీ జరుగుతుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కోల్​ ఇండియా రిక్రూట్​మెంట్​ 2024..

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 29, 2024
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2024 నవంబర్ 28

ఖాళీల వివరాలు..

  • మైనింగ్: 263 పోస్టులు
  • సివిల్: 91 పోస్టులు
  • ఎలక్ట్రికల్: 102 పోస్టులు
  • మెకానికల్: 104 పోస్టులు
  • సిస్టెమ్: 41 పోస్టులు
  • ఈ అండ్ టీ: 39 పోస్టులు

ఇదీ చూడండి:- GATE 2025 : గేట్​ అభ్యర్థులకు అలర్ట్​- మీ స్కోర్​ పెంచుకునేందుకు మంచి ఛాన్స్​!

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితిని తెలుసుకునేందుకు కోల్​ ఇండియా రిక్రూట్​మెంట్​ 2024 నోటిఫికేషన్​ని చూడాల్సి ఉంటుంది. నోటిఫికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎంపిక విధానం..

కోల్​ ఇండియాలో ఉద్యోగాల కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2024)కు అర్హత సాధించి ఉండాలి. గేట్-2024 స్కోర్లు/మార్కులు, అవసరాన్ని బట్టి అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం మెరిట్ క్రమంలో 1:3 నిష్పత్తిలో విభాగాల వారీగా, కేటగిరీల వారీగా షార్ట్​లిస్ట్​ చేయడం జరుగుతుంది. గేట్ 2024 స్కోర్లు/ మార్కుల ఆధారంగా ప్రతి విభాగానికి తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి.

దరఖాస్తు ఫీజు

జనరల్ (యూఆర్) / ఓబీసీ (క్రీమీలేయర్ & నాన్క్రెమిలేయర్) / ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు నాన్ రిఫండబుల్ ఫీజు రూ.1000/- తో పాటు వర్తించే జీఎస్టీ – రూ.180/- మొత్తం రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజును ఆన్​లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్సైట్​ను చూడవచ్చు.

ఎన్ఐసీఎల్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు..

దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌భుత్వ రంగం ఇన్సురెన్స్ కంపెనీ ఎన్ఐసీఎల్ అసిస్టెంట్స్ (క్లాస్ III) పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. దేశ‌వ్యాప్తంగా 500 పోస్టులను భ‌ర్తీ చేయ‌గా, అందులో ఎస్సీ-43, ఎస్టీ-33, ఓబీసీ-113, ఈడ‌బ్ల్యూఎస్-41, జ‌న‌ర‌ల్ -270 పోస్టులు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. అందులో రిజ‌ర్వేష‌న్ వారీగా పోస్టులు చూస్తే ఎస్టీ-2, ఓబీసీ-7, ఈడబ్ల్యూఎస్-2, జ‌న‌ర‌ల్ -10 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link