Best Web Hosting Provider In India 2024

కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్ల నిర్మాణాలు చేపట్టామని, నాలుగు లైన్లరోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి 9 వేల ఎకరాల భూమి కేటాయించి, పరిశ్రమలకు నీరు తరలించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.