Best Web Hosting Provider In India 2024

శ్రీకాకుళం: 4 ఏళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 40 ఏళ్ల అభివృద్ధిని తీసుకుని వచ్చామని, సీఎం వైయస్ జగన్ అనేక పాలన సంబంధ సంస్కరణలను అమలు చేశారని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న విలీన పంచాయతీ సీపన్నాయుడు పేటలో గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు ఉన్నారు. ఆయనేం చేశారో చెప్పాలి ? ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలోనే అనేక పాలన సంస్కరణల అమలుతో యావత్ భారతావని దృష్టిని ఆకర్షిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతోంది. కానీ ఇప్పటిదాకా బ్రిటిషర్ల నాటి సర్వే రికార్డులనే పట్టుకుని తిరుగుతున్నాం.