Best Web Hosting Provider In India 2024

సచివాలయం: ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని సహించేది లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 4.60 లక్షల ఎకరాల దేవాలయాల భూమి ఆక్రమణల్లో ఉన్నట్టు, 1.65 కోట్ల గజాల వాణిజ్య స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఆక్రమణల్లో ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. సచివాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ భూముల స్వాధీనానికి చట్టంలో కీలక మార్పులు చేసి కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చామని వివరించారు.