Best Web Hosting Provider In India 2024

అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విధాలుగా చేయూత అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. మహిళా సాధికారతపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారని చెప్పారు. మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. దిశా యాప్, మహిళా పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను మోసం చేసిందని విమర్శించారు.