Best Web Hosting Provider In India 2024

విజయవాడ: హెరిటేజ్ ఆస్తులపై మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఏం చేశాడో తెలియాలంటే.. నేరుగా ఢిల్లీకి వెళ్లి తమకు ఆదాయానికి మించిన ఆస్తులు లేవు, కావాలంటే విచారణ చేసుకోండి, తాము నిప్పులమని సీబీఐ, ఈడీకి రాతపూర్వక పత్రం ఇవ్వాలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ విచారణలో చంద్రబాబు ఆస్తుల వివరాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి బీజేపీనా, టీడీపీనా.. ఏ పార్టీకి చెందిన నేత అనేది అర్థం కావడం లేదన్నారు.