దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో మీడియా సపోర్ట్‌

Best Web Hosting Provider In India 2024

అమరావతి: అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో సపోర్ట్‌ చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియాకు వాస్తవాలతో సంబంధం లేదని, జనం నమ్మక చస్తారా అనేదే ఎల్లో మీడియా ఆలోచన అంటూ దుయ్యబట్టారు. వీరంతా తోడు దొంగలే.. ఇంతకంటే పెద్ద పదం లేదు. లక్ష మంది గోబెల్స్‌ కలిస్తే ఒక చంద్రబాబు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ 20 రోజుల్లో లోకేశ్‌ ముఠా నానా యాగీ చేసింది. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంద‌ని సజ్జల పేర్కొన్నారు. సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన స్కామ్‌పై వీరంతా మాట్లాడటం లేదు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు. మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *