
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
పట్టణంలోని రామాలయంలో యాగశాల -పాకశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రామాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా ..
నందిగామ పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి [రామాలయం]దేవాలయంలో నూతనంగా నిర్మించనున్న యాగశాల పాకశాల నిర్మాణాలకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం శంకుస్థాపన చేశారు ,
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుంచెం విజయలక్ష్మి లక్ష్మీనారాయణ మరియు భక్తులు ,పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..