Best Web Hosting Provider In India 2024

శ్రీకాకుళం: ప్రజారోగ్యానికి భరోసా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమని రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనాలి. అధికారులతో పాటు వలంటీర్లు కలిసి ఇంటింటికీ వెళ్లాలి.నాయకత్వము నిరూపించుకునే సమయం ఇది. మేము చేస్తున్నాం అనే భావనతో ఉండాలి. ప్రభుత్వాలు ఎంత ఆర్థిక సాయం చేసినా ఆరోగ్యం విషయాల్లో చిన్న కుటుంబాలు చితికి పోతున్నాయి. అలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమం. చాలా మందికి ఏ ఆరోగ్య సమస్యకు ఎవరి వద్దకు వెళ్ళాలో తెలియదు.అలాంటి వారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయం ప్రభుత్వం నుంచి అందేవిధంగా చూడాలి. అలాంటప్పుడు శత్రు వర్గాలు కూడా అనుకూలంగా మారిపోతాయి.