పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు 

Best Web Hosting Provider In India 2024

 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ఏర్పాట‌వుతున్న ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ద‌క్కుతాయ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. మొత్తం  13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.  13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో  6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు.  

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *