Best Web Hosting Provider In India 2024

విజయవాడ: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని మంత్రి విడదల రజిని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సురక్ష ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టామన్నారు.