Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోందని, స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారని, జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మరోపక్క చంద్రబాబు బరువు తగ్గారంటూ ఇంకో తప్పుడు ప్రచారానికి తెగబడ్డారని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలన్నారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్కు పంపిందన్నారు. ఏసీ పెట్టమని అడగడానికి జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.