Crime news : కర్ణాటకలో దారుణం- ఇజ్రాయెల్​ టూరిస్ట్​పై సామూహిక అత్యాచారం! మరో మహిళపైనా..

Best Web Hosting Provider In India 2024


Crime news : కర్ణాటకలో దారుణం- ఇజ్రాయెల్​ టూరిస్ట్​పై సామూహిక అత్యాచారం! మరో మహిళపైనా..

Sharath Chitturi HT Telugu
Published Mar 08, 2025 12:03 PM IST

Karnataka rape case : కర్ణాటకలోని హంపీకి సమీపంలో ఐదుగురు సభ్యుల బృందంపై కొందరు దుండగులు దాడి చేశారు. బృందంలోని ముగ్గురు పురుషులను కొట్టారు. అనంతరం ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్​నకు గురైన మహిళల్లో ఒక ఇజ్రాయెల్​ దేశస్థురాలు కూడా ఉన్నారు.

హంపీకి సమీపంలో ఇద్దరు టూరిస్ట్​లపై అత్యాచారం..
హంపీకి సమీపంలో ఇద్దరు టూరిస్ట్​లపై అత్యాచారం..

కర్ణాటకలోని హంపి సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 27ఏళ్ల ఇజ్రాయెల్ టూరిస్ట్​తో పాటు స్థానిక హోమ్ స్టే నడుపుతున్న 29ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఇద్దరు మహిళలు భోజనం తర్వాత ముగ్గురు పురుష పర్యాటకులతో కలిసి సనాపూర్ సరస్సు వద్ద సమయం గడుపుతున్న వేళ ఈ షాకింగ్ సంఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

మీడియా కథనాల ప్రకారం బెంగళూరుకు 350 కి.మీల దూరంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బృందంలో ఒక అమెరికన్ పర్యాటకుడు, ఒడిశా- మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భారతీయులు ఉన్నారు. వారు సంగీతం వింటూ, రాత్రిపూట ఆకాశాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్స్​పై వచ్చి తొలుత పెట్రోల్ కావాలని కోరారు. అనంతరం సమీపంలోని ఫ్యూయెల్​ స్టేషన్​ గురించి ఆరా తీశారు. చుట్టుపక్కల ఎవరూ లేరని తెలియడంతో రూ.100 డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడిన దుండగులు రెచ్చిపోయి టూరిస్ట్​లపై దాడికి దిగారు.

ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మహిళలను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా, పురుష పర్యాటకులను కాలువలోకి తోసేశారు. వీరిలో ఇద్దరికి గాయాలు కాగా, ఒడిశాకు చెందిన పర్యాటకుడు గల్లంతయ్యాడు. చాలా సేపు వెతికిన తర్వాత అతని మృతదేహాన్ని శనివారం గుర్తించారు.

ఈ సంఘటన తరువాత గంగావతి గ్రామీణ పోలీసు స్టేషన్​లో సామూహిక అత్యాచారం, దోపిడీ, తీవ్రమైన హాని కలిగించే ఉద్దేశంతో దోపిడీ, హత్యాయత్నం సహా భారతీయ న్యాయ సంహితలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనుమానితులను గుర్తించిన అధికారులు వారి ఆచూకీ కోసం ఆరు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నిందితులను పట్టుకునేందుకు డాగ్​ స్క్వాడ్​ని రంగంలోకి దింపినట్టు వెల్లడించారు.

“వీలైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని న్యాయం ముందు నిలబెడతాం,” అని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.

నిందితులను కచ్చితంగా పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

మరోవైపు గాయపడిన ఇద్దరు మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిపై అత్యాచారం జరిగిందా? అని తెలుసుకునేందుకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link