



Best Web Hosting Provider In India 2024
Crime news : కర్ణాటకలో దారుణం- ఇజ్రాయెల్ టూరిస్ట్పై సామూహిక అత్యాచారం! మరో మహిళపైనా..
Karnataka rape case : కర్ణాటకలోని హంపీకి సమీపంలో ఐదుగురు సభ్యుల బృందంపై కొందరు దుండగులు దాడి చేశారు. బృందంలోని ముగ్గురు పురుషులను కొట్టారు. అనంతరం ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్నకు గురైన మహిళల్లో ఒక ఇజ్రాయెల్ దేశస్థురాలు కూడా ఉన్నారు.

కర్ణాటకలోని హంపి సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 27ఏళ్ల ఇజ్రాయెల్ టూరిస్ట్తో పాటు స్థానిక హోమ్ స్టే నడుపుతున్న 29ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఇద్దరు మహిళలు భోజనం తర్వాత ముగ్గురు పురుష పర్యాటకులతో కలిసి సనాపూర్ సరస్సు వద్ద సమయం గడుపుతున్న వేళ ఈ షాకింగ్ సంఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
మీడియా కథనాల ప్రకారం బెంగళూరుకు 350 కి.మీల దూరంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బృందంలో ఒక అమెరికన్ పర్యాటకుడు, ఒడిశా- మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భారతీయులు ఉన్నారు. వారు సంగీతం వింటూ, రాత్రిపూట ఆకాశాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్స్పై వచ్చి తొలుత పెట్రోల్ కావాలని కోరారు. అనంతరం సమీపంలోని ఫ్యూయెల్ స్టేషన్ గురించి ఆరా తీశారు. చుట్టుపక్కల ఎవరూ లేరని తెలియడంతో రూ.100 డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడిన దుండగులు రెచ్చిపోయి టూరిస్ట్లపై దాడికి దిగారు.
ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మహిళలను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా, పురుష పర్యాటకులను కాలువలోకి తోసేశారు. వీరిలో ఇద్దరికి గాయాలు కాగా, ఒడిశాకు చెందిన పర్యాటకుడు గల్లంతయ్యాడు. చాలా సేపు వెతికిన తర్వాత అతని మృతదేహాన్ని శనివారం గుర్తించారు.
ఈ సంఘటన తరువాత గంగావతి గ్రామీణ పోలీసు స్టేషన్లో సామూహిక అత్యాచారం, దోపిడీ, తీవ్రమైన హాని కలిగించే ఉద్దేశంతో దోపిడీ, హత్యాయత్నం సహా భారతీయ న్యాయ సంహితలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అనుమానితులను గుర్తించిన అధికారులు వారి ఆచూకీ కోసం ఆరు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దింపినట్టు వెల్లడించారు.
“వీలైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని న్యాయం ముందు నిలబెడతాం,” అని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
నిందితులను కచ్చితంగా పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
మరోవైపు గాయపడిన ఇద్దరు మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిపై అత్యాచారం జరిగిందా? అని తెలుసుకునేందుకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link