పెళ్లి మండపం వద్దే వరుడికి గుండెపోటు.. పెళ్లి చేసుకున్న 15 నిమిషాల్లోనే నవ వధువు వితంతువు!

Best Web Hosting Provider In India 2024


పెళ్లి మండపం వద్దే వరుడికి గుండెపోటు.. పెళ్లి చేసుకున్న 15 నిమిషాల్లోనే నవ వధువు వితంతువు!

Anand Sai HT Telugu

పెళ్లి మండపంలో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదంలో మునిగింది. పెళ్లి అయిన కాసేపటికే వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

పెళ్లి మండపం వద్దే వరుడికి గుండెపోటు

ఆ జంట రెట్రో స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. అందరికీ నచ్చే వీడియోతో వివాహానికి ఆహ్వానాలను పంపారు. పెళ్లి మండపంలో కుటుంబం అంతా ఆనందంగా ఉంది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ జంట సంబరాల్లో మునిగిపోయింది. కానీ విధి వారిని చూసి అసూయపడింది. వివాహం జరిగిన 15 నిమిషాల్లోనే వరుడు గుండెపోటుతో మరణించాడు. మృతుడు వరుడు ప్రవీణ్ కుర్నే(25) మరణంతో కొన్ని క్షణాల్లో నవ వధువు వితంతువుగా మారింది. వివాహ వేడుక కాస్త దుఃఖంతో నిండిపోయింది.

15 నిమిషాల్లోనే

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జామఖండి నగరంలోని నందికేశ్వర్ కళ్యాణమంటపంలో ప్రవీణ్ కుర్నే వివాహం శనివారం జరిగింది. అయితే వివాహ వేడుక జరిగిన కొన్ని క్షణాల్లోనే విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్ పెళ్లి చేసుకున్న 15 నిమిషాల్లోనే గుండెపోటుతో మరణించాడు.

పెళ్లి చేసుకున్న తర్వాత నూతన వధూవరులు వేదికపై నిలబడ్డారు. రెండు మూడు ఫోటోలు మాత్రమే తీసుకున్నారు. ఇంతలో వరుడు ప్రవీణ్‌కు కాళ్ళు వణుకుతూ, ఛాతీ నొప్పి మొదలైంది. కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రవీణ్ చనిపోయాడు. పెళ్లి చేసుకున్న 15 నిమిషాలకే నవ వధువు వితంతువు అయింది.

ప్రైవేట్ బ్యాంక్‌లో పని

మృతుడు ప్రవీణ్ జామఖండి తాలూకాలోని కుంబరహల్లా గ్రామ నివాసి. వధువుది బెల్గాం జిల్లా అథని తాలూకాలోని పార్థనహళ్లి గ్రామం. ప్రవీణ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేవాడు. ప్రవీణ తన మామ కూతురిని వివాహం చేసుకున్నాడు. నూతన వధూవరులను ఆనందంతో ఆశీర్వదించడానికి బంధువులందరూ వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని అందమైన కుటుంబంతో జీవించాల్సిన వరుడు మరణించాడు.

ఈ విషాద సంఘటనను చూసిన జనాలు కన్నీంటి పర్యంతమయ్యారు. ప్రవీణ్‌ను ఆశీర్వదించడానికి వచ్చామని ఇలా అవుతుందని ఊహించ లేదని బోరున ఏడ్చారు. అందమైన జీవితంలోకి ఏడు అడుగులతో ఆహ్వానం పలకాలి అనుకున్న ప్రవీణ్.. తుది శ్వాస విడవడంతో కుటంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link