అడవిలో ట్రెక్కింగ్ చేస్తుండగా దొరికిన 100 ఏళ్ల కిందటి నిధి.. 598 బంగారు నాణేలు, 10 బ్రేస్‌లెట్లు

Best Web Hosting Provider In India 2024


అడవిలో ట్రెక్కింగ్ చేస్తుండగా దొరికిన 100 ఏళ్ల కిందటి నిధి.. 598 బంగారు నాణేలు, 10 బ్రేస్‌లెట్లు

Anand Sai HT Telugu

ఇద్దరు పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తున్నారు. అకస్మాత్తుగా వారికి ఓ రాయి దగ్గర కాంతి ప్రకాశించినట్టుగా కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా షాక్ అయ్యారు. వారికి నిధి దొరికింది.

ప్రతీకాత్మక చిత్రం

ద్దరు పర్యాటకులు అడవిలో నడుస్తున్నారు. అకస్మాత్తుగా వారి కళ్లకు ఏదో మెరిసినట్టుగా అనిపించింది. తర్వాత దాని దగ్గరకు వెళ్లి చూడగా.. నిధి కనిపించింది. ఇది సినిమాలోని సన్నివేశం కాదు. ఇటీవలే జరిగిన నిజ సంఘటన. చెక్ రిపబ్లిక్‌లో అడవిలో పర్యాటకుల ట్రెక్కింగ్ సందర్భంగా బంగారు నాణేలు దొరికాయి. అడవిలో ప్రశాంతమైన నడకగా ప్రారంభమైన ఈ ప్రయాణం వారి జీవితంలో మరిచిపోలేని ఘటనగా నిలిచింది.

చెక్ రిపబ్లిక్ ఉత్తరాన ఉన్న క్రోనోస్ పర్వతాలలో ఇద్దరు వ్యక్తులు ట్రెక్కింగ్ చేస్తున్నారు. నెమ్మదిగా పర్వతం ఎక్కుతుండగా, వారు ఒక దృశ్యాన్ని చూశారు. గడ్డితో ఒక పచ్చని ప్రాంతం ఉంది. అక్కడే ఒక రాయి కింద ఒక మెరుపు కనిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించినప్పుడు అక్కడ ఓ అల్యూమినియం పెట్టె ఉందని వారికి అర్థమైంది. వాళ్ళు దాన్ని తెరిచినప్పుడు లోపల పెద్ద నిధిని చూసి ఆశ్చర్యపోయారు.

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. అల్యూమినియం పెట్టెలో 598 బంగారు నాణేలు, 10 బంగారు కంకణాలు, 17 సీలు చేసిన సిగార్ పెట్టెలు, కాంపాక్ట్ పౌడర్, ఒక దువ్వెన ఉన్నాయి. బంగారు నాణేలు మాత్రమే 3.7 కిలోగ్రాముల బరువు ఉంటాయి. బంగారంతో సీలు చేసిన సిగార్ పెట్టెలను ఎందుకు ఉంచారనేది తెలియదు.

ఈ ప్రయాణికులు వారు కనుగొన్న నిధిని తూర్పు బోహేమియన్ మ్యూజియానికి అప్పగించారు. మ్యూజియం బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ నిధి 100 సంవత్సరాల పురాతనమైనదని అంచనా వేసింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముందు దాచిన నిధి కావచ్చునని అంటున్నారు. 1920, 1930ల నాటి కొన్ని నాణేలలో పూర్వ యుగోస్లావ్ చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ నాణేలలో ఏవీ చెక్ దేశానికి చెందినవి కావు, సగం బాల్కన్ ప్రాంతానికి చెందినవి. మిగిలినవి ఫ్రాన్స్‌కు చెందినవి.

చెక్ చట్టం ప్రకారం, ఈ విధంగా పొందిన నిధి అధికారికంగా స్థానిక ప్రభుత్వానికి చెందుతుంది. అదే సమయంలో నిధిని కనుగొన్న వారికి దాని విలువ ఆధారంగా కొంత బహుమతి లభిస్తుంది. అమూల్యమైన నిధిని దొరకడంతో పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల దృష్టి ఈ ప్రాంతంపై మళ్లింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link